Operation Sindhudurg: చైనా ఆయుధాల డొల్లతనాన్ని ఎత్తిచూపిన 'ఆపరేషన్ సిందూర్'!
- ఇటీవల ఆపరేషన్ సిందూర్
- చేతులెత్తేసిన పాక్ ఆయుధాలు
- చైనా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్న పాక్
- తుస్సుమన్న ఆయుధాలు... దారుణంగా భంగపడిన దాయాది
పొరుగుదేశం పాకిస్థాన్ ఎంతగానో నమ్ముకున్న చైనా ఆయుధ వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ ఆయుధాలు ఘోరంగా విఫలమైనట్లు అనేక నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా భారత వైమానిక దాడులను ఎదుర్కోవడంలో చైనా నుంచి సేకరించిన అనేక రక్షణ వ్యవస్థలు చేతులెత్తేశాయని స్పష్టమవుతోంది. భారతీయ, పాశ్చాత్య ఆయుధ వేదికల సమన్వయంతో సాగిన ఈ ఆపరేషన్లో చైనా టెక్నాలజీ తేలిపోయింది. ఈ పరిణామాలు చైనా ఆయుధాల విశ్వసనీయత, సమర్థతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
గగనతల రక్షణలో ఘోర వైఫల్యం
విశ్వసనీయ సమాచారం ప్రకారం, భారత విమానాలు లేదా క్షిపణులను అడ్డుకోవడంలో పాకిస్థాన్ వినియోగించిన చైనా తయారీ హెచ్క్యూ-9 వాయు రక్షణ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. కీలక సైనిక స్థావరాల వద్ద మోహరించినప్పటికీ, భారత బలగాలు ఈ వ్యవస్థలను సునాయాసంగా ఛేదించగలిగాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఈ రక్షణ కవచాన్ని సునాయాసంగా ఛేదించాయి. హెచ్క్యూ-9తో పాటు, హెచ్క్యూ-16/ఎల్వై-80 వంటి ఇతర చైనా వాయు రక్షణ విభాగాల అసమర్థత కూడా బయటపడింది. ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యవస్థల ముందు ఇవి లక్ష్యాలను గుర్తించడంలో, ప్రతిస్పందించడంలో వెనుకబడ్డాయని తేలింది. అయితే, హెచ్క్యూ-9 వైఫల్యానికి పాకిస్థాన్ సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం, కార్యాచరణ లోపాలే కారణమని చైనా జాతీయులు సోషల్ మీడియాలో విమర్శించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
తుస్సుమన్న చైనా క్షిపణులు
మెరికాకు చెందిన ఏఐఎం-120డి వంటి పాశ్చాత్య క్షిపణులకు దీటుగా ప్రచారం పొందిన చైనా తయారీ పీఎల్-15 గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు కూడా నిర్దేశిత లక్ష్యాలను ఛేదించలేకపోయాయని, కొన్ని సందర్భాల్లో గాల్లోనే మొరాయించాయని తెలిసింది. హోషియార్పూర్లో స్వాధీనం చేసుకున్న, లక్ష్యాన్ని తాకకుండానే కిందపడిపోయిన పీఎల్-15 క్షిపణి శకలాలను భారత సైనిక అధికారులు ప్రదర్శించడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు, "క్యారియర్ కిల్లర్"గా పేరుపొందిన సీఎం-400ఏకేజీ గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించే క్షిపణిని భారత నేత్ర, అవాక్స్ వ్యవస్థలు ముందుగానే గుర్తించాయి. అధిక వేగం ఉన్నప్పటికీ, స్టెల్త్ లక్షణాలు లేకపోవడం, విన్యాస సామర్థ్యం పరిమితంగా ఉండటంతో దీనిని జామ్ చేయడం, దారి మళ్లించడం సులువైందని నివేదికలు పేర్కొన్నాయి.
యుద్ధ విమానాలు, రాడార్ల దుస్థితి
పీఎల్-15 క్షిపణులతో కూడిన చైనా నిర్మిత జె-10సి, జెఎఫ్-17 బ్లాక్ III యుద్ధ విమానాలను పాకిస్థాన్ రంగంలోకి దించినప్పటికీ, అవి భారత వైమానిక దాడులను గణనీయంగా అడ్డుకోలేకపోయాయి. రఫేల్లతో సహా పలు భారతీయ విమానాలను జె-10సి కూల్చివేసిందంటూ పాకిస్థాన్, చైనా ప్రచార సాధనాలు చేసిన వాదనలకు స్వతంత్ర వర్గాల నుంచి ధృవీకరణ లభించలేదు. కూల్చివేసినట్లు చెప్పబడుతున్న భారత విమాన శకలాలను పాకిస్థాన్ ఇంతవరకు ప్రదర్శించలేకపోయింది. అంతేకాకుండా, మధ్య పంజాబ్లోని చునియన్ వైమానిక స్థావరంలో ఉన్న చైనా సరఫరా చేసిన వైఎల్సి-8ఇ యాంటీ-స్టెల్త్ రాడార్ను భారత వైమానిక దళం దాడి చేసి ధ్వంసం చేసినట్లు సమాచారం.
డ్రోన్లు, గైడెడ్ క్షిపణులకూ అదే గతి!
పాకిస్థాన్ నిఘా, దాడుల కోసం ఉపయోగించిన చైనా తయారీ ఏఆర్-1 లేజర్-గైడెడ్ క్షిపణులను (వింగ్ లూంగ్-II డ్రోన్ల ద్వారా ప్రయోగించేవి) భారత గగనతల రక్షణ వ్యవస్థలు లక్ష్యాలను చేరకముందే విజయవంతంగా అడ్డగించాయి... వాటిని నిర్వీర్యం చేశాయి. అదేవిధంగా, పలు చైనా డ్రోన్లను కూడా భారత బలగాలు అడ్డగించి, వాటి శకలాలను ప్రదర్శించాయి. ఈ పరిణామాలు చైనా ఆయుధ వ్యవస్థల నాణ్యత, సమర్థతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి. పాకిస్థాన్ రక్షణ సామర్థ్యంపై కూడా ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంది.
గగనతల రక్షణలో ఘోర వైఫల్యం
విశ్వసనీయ సమాచారం ప్రకారం, భారత విమానాలు లేదా క్షిపణులను అడ్డుకోవడంలో పాకిస్థాన్ వినియోగించిన చైనా తయారీ హెచ్క్యూ-9 వాయు రక్షణ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. కీలక సైనిక స్థావరాల వద్ద మోహరించినప్పటికీ, భారత బలగాలు ఈ వ్యవస్థలను సునాయాసంగా ఛేదించగలిగాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఈ రక్షణ కవచాన్ని సునాయాసంగా ఛేదించాయి. హెచ్క్యూ-9తో పాటు, హెచ్క్యూ-16/ఎల్వై-80 వంటి ఇతర చైనా వాయు రక్షణ విభాగాల అసమర్థత కూడా బయటపడింది. ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యవస్థల ముందు ఇవి లక్ష్యాలను గుర్తించడంలో, ప్రతిస్పందించడంలో వెనుకబడ్డాయని తేలింది. అయితే, హెచ్క్యూ-9 వైఫల్యానికి పాకిస్థాన్ సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం, కార్యాచరణ లోపాలే కారణమని చైనా జాతీయులు సోషల్ మీడియాలో విమర్శించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
తుస్సుమన్న చైనా క్షిపణులుమెరికాకు చెందిన ఏఐఎం-120డి వంటి పాశ్చాత్య క్షిపణులకు దీటుగా ప్రచారం పొందిన చైనా తయారీ పీఎల్-15 గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు కూడా నిర్దేశిత లక్ష్యాలను ఛేదించలేకపోయాయని, కొన్ని సందర్భాల్లో గాల్లోనే మొరాయించాయని తెలిసింది. హోషియార్పూర్లో స్వాధీనం చేసుకున్న, లక్ష్యాన్ని తాకకుండానే కిందపడిపోయిన పీఎల్-15 క్షిపణి శకలాలను భారత సైనిక అధికారులు ప్రదర్శించడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు, "క్యారియర్ కిల్లర్"గా పేరుపొందిన సీఎం-400ఏకేజీ గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించే క్షిపణిని భారత నేత్ర, అవాక్స్ వ్యవస్థలు ముందుగానే గుర్తించాయి. అధిక వేగం ఉన్నప్పటికీ, స్టెల్త్ లక్షణాలు లేకపోవడం, విన్యాస సామర్థ్యం పరిమితంగా ఉండటంతో దీనిని జామ్ చేయడం, దారి మళ్లించడం సులువైందని నివేదికలు పేర్కొన్నాయి.
యుద్ధ విమానాలు, రాడార్ల దుస్థితి
పీఎల్-15 క్షిపణులతో కూడిన చైనా నిర్మిత జె-10సి, జెఎఫ్-17 బ్లాక్ III యుద్ధ విమానాలను పాకిస్థాన్ రంగంలోకి దించినప్పటికీ, అవి భారత వైమానిక దాడులను గణనీయంగా అడ్డుకోలేకపోయాయి. రఫేల్లతో సహా పలు భారతీయ విమానాలను జె-10సి కూల్చివేసిందంటూ పాకిస్థాన్, చైనా ప్రచార సాధనాలు చేసిన వాదనలకు స్వతంత్ర వర్గాల నుంచి ధృవీకరణ లభించలేదు. కూల్చివేసినట్లు చెప్పబడుతున్న భారత విమాన శకలాలను పాకిస్థాన్ ఇంతవరకు ప్రదర్శించలేకపోయింది. అంతేకాకుండా, మధ్య పంజాబ్లోని చునియన్ వైమానిక స్థావరంలో ఉన్న చైనా సరఫరా చేసిన వైఎల్సి-8ఇ యాంటీ-స్టెల్త్ రాడార్ను భారత వైమానిక దళం దాడి చేసి ధ్వంసం చేసినట్లు సమాచారం.
డ్రోన్లు, గైడెడ్ క్షిపణులకూ అదే గతి!
పాకిస్థాన్ నిఘా, దాడుల కోసం ఉపయోగించిన చైనా తయారీ ఏఆర్-1 లేజర్-గైడెడ్ క్షిపణులను (వింగ్ లూంగ్-II డ్రోన్ల ద్వారా ప్రయోగించేవి) భారత గగనతల రక్షణ వ్యవస్థలు లక్ష్యాలను చేరకముందే విజయవంతంగా అడ్డగించాయి... వాటిని నిర్వీర్యం చేశాయి. అదేవిధంగా, పలు చైనా డ్రోన్లను కూడా భారత బలగాలు అడ్డగించి, వాటి శకలాలను ప్రదర్శించాయి. ఈ పరిణామాలు చైనా ఆయుధ వ్యవస్థల నాణ్యత, సమర్థతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి. పాకిస్థాన్ రక్షణ సామర్థ్యంపై కూడా ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంది.