Chandrababu Naidu: తాను బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటారో చెప్పిన సీఎం చంద్రబాబు
- విజయవాడలో పశుసంవర్ధక శాఖ, టెక్ ఏఐ 2.0 సమ్మిట్
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
- తాను ఉదయం పూట కేవలం ఆమ్లెట్ మాత్రమే తింటానని వెల్లడి
- ప్రొటీన్ ఫుడ్ కు ప్రాధాన్యత పెరుగుతోందని వివరణ
దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలకు బియ్యం అందుబాటులోకి వచ్చాయని, అంతకుముందు చాలా ప్రాంతాల్లో ప్రజలు జొన్నలు, రాగులు వంటి వాటినే ప్రధాన ఆహారంగా తీసుకునేవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు కూడా గణనీయంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ, టెక్ ఏఐ 2.0 సమ్మిట్ లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాటి పరిస్థితులను వివరించారు. "కొన్ని ప్రాంతాల్లో రాగి, మరికొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ, మన నాయకుడు ఎన్.టి. రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడంతో అందరికీ అన్నం తినే అవకాశం లభించింది. కరవు ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడే అన్నం తినడం ప్రారంభించారు" అని ఆయన తెలిపారు.
అయితే, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, బియ్యం అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. "మనిషి ఆరోగ్యం మనం తినే తిండి, మన అలవాట్లు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, చేపలు, గుడ్లు వంటి ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. గుడ్ల వినియోగం తగ్గిందని కొందరు మిత్రులు చెబుతున్నారు, దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఉదయం అల్పాహారంగా కేవలం ఆమ్లెట్ మాత్రమే తీసుకుంటాను, నా జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నాను" అని ఆయన వివరించారు.
ప్రోటీన్లతో పాటు, సమతుల ఆహారం కోసం సిరిధాన్యాలు (మిల్లెట్స్), పండ్లు, కూరగాయల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మార్పుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యానవన పంటలకు (హార్టికల్చర్) ప్రాధాన్యత పెరిగిందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా హార్టికల్చర్ను ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాటి పరిస్థితులను వివరించారు. "కొన్ని ప్రాంతాల్లో రాగి, మరికొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ, మన నాయకుడు ఎన్.టి. రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడంతో అందరికీ అన్నం తినే అవకాశం లభించింది. కరవు ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడే అన్నం తినడం ప్రారంభించారు" అని ఆయన తెలిపారు.
అయితే, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, బియ్యం అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. "మనిషి ఆరోగ్యం మనం తినే తిండి, మన అలవాట్లు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, చేపలు, గుడ్లు వంటి ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. గుడ్ల వినియోగం తగ్గిందని కొందరు మిత్రులు చెబుతున్నారు, దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఉదయం అల్పాహారంగా కేవలం ఆమ్లెట్ మాత్రమే తీసుకుంటాను, నా జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నాను" అని ఆయన వివరించారు.
ప్రోటీన్లతో పాటు, సమతుల ఆహారం కోసం సిరిధాన్యాలు (మిల్లెట్స్), పండ్లు, కూరగాయల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మార్పుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యానవన పంటలకు (హార్టికల్చర్) ప్రాధాన్యత పెరిగిందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా హార్టికల్చర్ను ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు.