Neeraj Chopra: బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా
- జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు విశిష్ట గౌరవం
- ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ప్రదానం
- గెజిట్ లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం
భారత జావెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ) అతడికి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది. ఈ నియామకం ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారత ప్రభుత్వ అధికారిక పత్రిక అయిన 'ది గెజిట్ ఆఫ్ ఇండియా' ఈ నియామకానికి సంబంధించిన వివరాలను ప్రచురించింది. "టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్, 1948లోని పారా-31 ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, రాష్ట్రపతి మాజీ సుబేదార్ మేజర్ నీరజ్ చోప్రా, పీవీఎస్ఎం, పద్మశ్రీ, వీఎస్ఎం (గ్రామం & పోస్ట్ ఆఫీస్ ఖాంద్రా, పానిపట్, హర్యానా) గారికి 2025 ఏప్రిల్ 16 నుంచి ఈ గౌరవ హోదాను ప్రదానం చేస్తున్నారు" అని మిలిటరీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, మేజర్ జనరల్ జీఎస్ చౌధరి పేరిట విడుదలైన ప్రకటనలో స్పష్టం చేశారు.
క్రీడాకారులకు సైనిక గౌరవాలు
గతంలో పలువురు ప్రముఖ క్రీడాకారులకు కూడా ఇటువంటి గౌరవ హోదాలు లభించాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్లకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ హోదాలు దక్కాయి. అదేవిధంగా, 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రాకు 2011లో టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు 2010లో భారత వైమానిక దళం (IAF) గ్రూప్ కెప్టెన్ గౌరవ హోదాను ప్రదానం చేశారు.
సైన్యంలో నీరజ్ ప్రస్థానం
నీరజ్ చోప్రా 2016 ఆగస్టు 26న భారత సైన్యంలో నాయబ్ సుబేదార్ హోదాలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ)గా చేరారు. జావెలిన్ త్రో క్రీడాంశంలో తన ప్రతిభతో భారత్ కు అంతర్జాతీయంగా గుర్తింపు అందించాడు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు.
అతడి సేవలకు గుర్తింపుగా 2018లో అర్జున అవార్డు, 2021లో విశిష్ట సేవా పతకం (VSM) లభించాయి. అదే సంవత్సరంలో చోప్రా సుబేదార్గా పదోన్నతి పొందాడు. 2022లో భారత సాయుధ దళాల అత్యున్నత శాంతి సమయ పతకం అయిన పరమ విశిష్ట సేవా పతకం (PVSM) స్వీకరించిన అనంతరం, రెండేళ్ల తర్వాత సుబేదార్ మేజర్గా పదోన్నతి పొందాడు.
భారత ప్రభుత్వ అధికారిక పత్రిక అయిన 'ది గెజిట్ ఆఫ్ ఇండియా' ఈ నియామకానికి సంబంధించిన వివరాలను ప్రచురించింది. "టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్, 1948లోని పారా-31 ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, రాష్ట్రపతి మాజీ సుబేదార్ మేజర్ నీరజ్ చోప్రా, పీవీఎస్ఎం, పద్మశ్రీ, వీఎస్ఎం (గ్రామం & పోస్ట్ ఆఫీస్ ఖాంద్రా, పానిపట్, హర్యానా) గారికి 2025 ఏప్రిల్ 16 నుంచి ఈ గౌరవ హోదాను ప్రదానం చేస్తున్నారు" అని మిలిటరీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, మేజర్ జనరల్ జీఎస్ చౌధరి పేరిట విడుదలైన ప్రకటనలో స్పష్టం చేశారు.
క్రీడాకారులకు సైనిక గౌరవాలు
గతంలో పలువురు ప్రముఖ క్రీడాకారులకు కూడా ఇటువంటి గౌరవ హోదాలు లభించాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్లకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ హోదాలు దక్కాయి. అదేవిధంగా, 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రాకు 2011లో టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు 2010లో భారత వైమానిక దళం (IAF) గ్రూప్ కెప్టెన్ గౌరవ హోదాను ప్రదానం చేశారు.
సైన్యంలో నీరజ్ ప్రస్థానం
నీరజ్ చోప్రా 2016 ఆగస్టు 26న భారత సైన్యంలో నాయబ్ సుబేదార్ హోదాలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ)గా చేరారు. జావెలిన్ త్రో క్రీడాంశంలో తన ప్రతిభతో భారత్ కు అంతర్జాతీయంగా గుర్తింపు అందించాడు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు.
అతడి సేవలకు గుర్తింపుగా 2018లో అర్జున అవార్డు, 2021లో విశిష్ట సేవా పతకం (VSM) లభించాయి. అదే సంవత్సరంలో చోప్రా సుబేదార్గా పదోన్నతి పొందాడు. 2022లో భారత సాయుధ దళాల అత్యున్నత శాంతి సమయ పతకం అయిన పరమ విశిష్ట సేవా పతకం (PVSM) స్వీకరించిన అనంతరం, రెండేళ్ల తర్వాత సుబేదార్ మేజర్గా పదోన్నతి పొందాడు.