Pakistan: భారత్ దెబ్బ... ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ సైరన్లు!
- భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
- ఇస్లామాబాద్లో మోగిన ప్రమాద ఘంటికలు
- పాక్ ప్రధాని కార్యాలయంలో అత్యవసర సమావేశం సందర్భంగా మోగిన సైరన్
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లో బుధవారం అలజడి రేగింది. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత్ చేపట్టిన ప్రతీకార చర్యల నేపథ్యంలో ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ సైరన్లు మోగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే సమయంలో పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుండటం గమనార్హం.
పహల్గామ్ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించిందని, అయితే భారత బలగాలు ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు నిర్వహించింది. ముఖ్యంగా లాహోర్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు దెబ్బతీశాయి.
కొన్ని గంటల క్రితం పాకిస్థాన్లోని లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్తో పాటు పలువురు ఉన్నతస్థాయి సైనిక అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితులపై చర్చిస్తున్న తరుణంలోనే నగరంలో ఎమర్జెన్సీ సైరన్లు ఒక్కసారిగా మోగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో పాకిస్థాన్ అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి.
పహల్గామ్ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించిందని, అయితే భారత బలగాలు ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు నిర్వహించింది. ముఖ్యంగా లాహోర్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు దెబ్బతీశాయి.
కొన్ని గంటల క్రితం పాకిస్థాన్లోని లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్తో పాటు పలువురు ఉన్నతస్థాయి సైనిక అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితులపై చర్చిస్తున్న తరుణంలోనే నగరంలో ఎమర్జెన్సీ సైరన్లు ఒక్కసారిగా మోగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో పాకిస్థాన్ అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి.