ఏపీలో 72 ఏళ్ల అవ్వ.. తెలంగాణలో తల్లీకూతుళ్లు.. నీట్ పరీక్ష విశేషాలు
––
తెలంగాణలో మరో విశేషం చోటుచేసుకుంది. తన కూతురుతో పాటు ఓ మహిళ ఆదివారం జరిగిన నీట్ పరీక్ష రాశారు. అయితే, తల్లీకూతుళ్లు ఇద్దరూ వేర్వేరు జిల్లాల్లో పరీక్ష రాశారు.
సూర్యాపేట జిల్లాలోని మంచ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సరిత(38) ప్రస్తుతం ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. వివాహం కారణంగా బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరంలో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. సరిత, భూక్యా కిషన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కావేరిని డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో నీట్ పరీక్షకు శిక్షణ ఇప్పించారు. ఆ సమయంలోనే తాను కూడా పరీక్ష రాయాలని సరిత నిర్ణయించుకుని కూతురుతో పాటు సిద్ధమయ్యారు. ఆదివారం తల్లి సరిత సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కుమార్తె కావేరి ఖమ్మం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో పరీక్ష రాశారు.