Pakistan: భారత్కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
- పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్కు పాకిస్థాన్ తీవ్ర హెచ్చరికలు
- భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో సహా పూర్తిస్థాయి శక్తిని ఉపయోగిస్తామన్న పాక్ రాయబారి
- భారత సైనిక చర్య ఆసన్నమైందని తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్న పాక్ మంత్రులు
- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు తీసుకుంటుందనే భయంతో పాక్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గత నెలలో జరిగిన ఘోర ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలో పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలి భారత్కు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ భారత్ తమ దేశంపై దాడికి పాల్పడితే, అణ్వాయుధాలతో సహా తమ వద్ద ఉన్న ‘పూర్తిస్థాయి శక్తి’ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.
ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమాలి మాట్లాడుతూ భారత్ తమ దేశంలోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘భారత మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు, ఆ దేశం నుంచి వెలువడుతున్న బాధ్యతారహితమైన ప్రకటనలు మమ్మల్ని ఈ నిర్ణయానికి పురికొల్పాయి. పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని నిర్ణయించినట్టు కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. దీనివల్ల దాడి జరగబోతోందని, అది ఆసన్నమైందని మేము భావిస్తున్నాం’ అని జమాలి పేర్కొన్నారు.
భారత్పై సర్వశక్తులు ఒడ్డుతాం
సంఖ్యాబలం గురించి చర్చల్లోకి తాము వెళ్లదల్చుకోలేదని, భారత్ విషయంలో సంప్రదాయ, అణుశక్తితో కూడిన పూర్తిస్థాయి శక్తిని ఉపయోగిస్తామని ఆయన నొక్కి చెప్పారు. పాకిస్థాన్ ప్రజల మద్దతుతో తమ సాయుధ బలగాలు సర్వశక్తులు ఒడ్డి ప్రతిస్పందిస్తాయని జమాలి వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్లోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిపిన దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలకు దిగుతుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
130 అణుబాంబులు భారత్ కోసమే
ఇటీవల, పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి కూడా భారత్పై అణుదాడి చేస్తామని బహిరంగంగా బెదిరించారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్థాన్కు నీటి సరఫరా ఆపాలని భారత్ ప్రయత్నిస్తే, పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఘోరీ, షాహీన్, గజని వంటి క్షిపణులు, 130 అణు వార్హెడ్లు కేవలం భారత్ కోసమే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
మరో పాక్ మంత్రి అతావుల్లా తరార్ బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే 24 నుంచి 36 గంటల్లో భారత్ సైనిక దాడికి పాల్పడవచ్చని తమకు ‘విశ్వసనీయ సమాచారం’ అందిందని తెలిపారు. ఏదైనా దురాక్రమణ జరిగితే, తీవ్రమైన పరిణామాలకు భారత్దే బాధ్యత అని, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని ఆయన హెచ్చరించారు.
భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ
పహల్గామ్ ఉగ్రదాడికి కారకులైన వారిని వేటాడతామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో పాక్ నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ దాడిపై స్పందించేందుకు భారత సైనిక దళాలకు ‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’ను ప్రధాని మోదీ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ ఇప్పటికే పాకిస్థాన్తో దౌత్య సంబంధాలను తగ్గించుకోవడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ పౌరులకు జారీచేసిన వీసాలను రద్దు చేయడం, పాకిస్థాన్ విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేయడం వంటి పలు చర్యలు తీసుకుంది. దీనికి ప్రతిగా, పాకిస్థాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమాలి మాట్లాడుతూ భారత్ తమ దేశంలోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘భారత మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు, ఆ దేశం నుంచి వెలువడుతున్న బాధ్యతారహితమైన ప్రకటనలు మమ్మల్ని ఈ నిర్ణయానికి పురికొల్పాయి. పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని నిర్ణయించినట్టు కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. దీనివల్ల దాడి జరగబోతోందని, అది ఆసన్నమైందని మేము భావిస్తున్నాం’ అని జమాలి పేర్కొన్నారు.
భారత్పై సర్వశక్తులు ఒడ్డుతాం
సంఖ్యాబలం గురించి చర్చల్లోకి తాము వెళ్లదల్చుకోలేదని, భారత్ విషయంలో సంప్రదాయ, అణుశక్తితో కూడిన పూర్తిస్థాయి శక్తిని ఉపయోగిస్తామని ఆయన నొక్కి చెప్పారు. పాకిస్థాన్ ప్రజల మద్దతుతో తమ సాయుధ బలగాలు సర్వశక్తులు ఒడ్డి ప్రతిస్పందిస్తాయని జమాలి వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్లోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిపిన దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలకు దిగుతుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
130 అణుబాంబులు భారత్ కోసమే
ఇటీవల, పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి కూడా భారత్పై అణుదాడి చేస్తామని బహిరంగంగా బెదిరించారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్థాన్కు నీటి సరఫరా ఆపాలని భారత్ ప్రయత్నిస్తే, పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఘోరీ, షాహీన్, గజని వంటి క్షిపణులు, 130 అణు వార్హెడ్లు కేవలం భారత్ కోసమే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
మరో పాక్ మంత్రి అతావుల్లా తరార్ బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే 24 నుంచి 36 గంటల్లో భారత్ సైనిక దాడికి పాల్పడవచ్చని తమకు ‘విశ్వసనీయ సమాచారం’ అందిందని తెలిపారు. ఏదైనా దురాక్రమణ జరిగితే, తీవ్రమైన పరిణామాలకు భారత్దే బాధ్యత అని, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని ఆయన హెచ్చరించారు.
భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ
పహల్గామ్ ఉగ్రదాడికి కారకులైన వారిని వేటాడతామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో పాక్ నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ దాడిపై స్పందించేందుకు భారత సైనిక దళాలకు ‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’ను ప్రధాని మోదీ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ ఇప్పటికే పాకిస్థాన్తో దౌత్య సంబంధాలను తగ్గించుకోవడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ పౌరులకు జారీచేసిన వీసాలను రద్దు చేయడం, పాకిస్థాన్ విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేయడం వంటి పలు చర్యలు తీసుకుంది. దీనికి ప్రతిగా, పాకిస్థాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.