Vinay Narwal: వైరల్ అయిన పహల్గామ్ ఫోటో వెనుక హృదయ విదారక కథ!
- కాశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతి
- పెళ్లయిన 6 రోజులకే... హనీమూన్లో ఘటన
- భర్త మృతదేహం వద్ద భార్య హిమాన్షి విలపిస్తున్న ఫోటో వైరల్
- స్విస్ వీసా ఆలస్యంతో కశ్మీర్కు హనీమూన్ ప్లాన్
- మృతదేహాన్ని హర్యానాలోని కర్నాల్కు తరలింపు
పెళ్లయి ఆరు రోజులే అయింది. కొత్త జీవితం ఎన్నో ఆశలతో మొదలైంది. హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లిన నవ దంపతులపై ఉగ్రవాదుల దాడి పెను విషాదాన్ని నింపింది. భర్త మృతదేహం వద్ద కొత్త పెళ్లికూతురు కన్నీరుమున్నీరవుతున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. ఆ ఫోటోలో ఉన్నది ఇటీవలే వివాహం చేసుకున్న నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్య హిమాన్షి అని బంధువులు, నేవీ అధికారులు ధృవీకరించారు.
వివరాల్లోకి వెళితే.. నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, స్కూల్ టీచర్ అయిన హిమాన్షిల వివాహం సరిగ్గా ఆరు రోజుల క్రితం ఏప్రిల్ 16న ముస్సోరీలో జరిగింది. ఏప్రిల్ 6న వీరి నిశ్చితార్థం జరిగింది. వాస్తవానికి వారు హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. కానీ, వీసా రావడంలో ఆలస్యం కావడంతో కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శ్రీనగర్ చేరుకున్న 48 గంటల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది. మంగళవారం నాడు పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.
ఇంకా పెళ్లి గాజులు కూడా తీయని హిమాన్షి తన భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పీటీఐ వార్తా సంస్థ ఈ ఫోటోను శ్రీనగర్లోని తమ స్ట్రింగర్ ద్వారా సేకరించి విడుదల చేసింది. "వినయ్ను ఉగ్రవాదులు చంపేశారని హిమాన్షి తన సోదరుడు లక్షిత్కు ఫోన్ చేసి చెప్పడంతో బుధవారం మధ్యాహ్నం మాకు విషయం తెలిసింది" అని హిమాన్షి మేనత్త బబిత తెలిపారు. మొదట అది నిజం కాకూడదని భావించినా, ఫోటోలు వార్తల్లో రావడంతో నిర్ధారణ అయిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
వినయ్, హిమాన్షీల కుటుంబాలకు చాలాకాలంగా పరిచయం ఉందని, వినయ్ తండ్రి రాజేష్ నర్వాల్, హిమాన్షి తండ్రి మంచి స్నేహితులని బంధువులు తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఇరు కుటుంబాల పెద్దలు పహల్గామ్కు బయలుదేరారు. వినయ్ భౌతికకాయాన్ని మంగళవారం ఢిల్లీకి, అక్కడి నుంచి అంత్యక్రియల నిమిత్తం స్వస్థలమైన హర్యానాలోని కర్నాల్కు తరలించారు. కర్నాల్లోని వినయ్ ఇంట్లో ఇంకా అతని పెళ్లి షేర్వాణీ వేలాడుతూనే ఉండటం, ముస్సోరీ నుంచి తెచ్చిన అతని ప్రయాణపు బ్యాగ్ పూర్తిగా సర్దకపోవడం.. అర్ధాంతరంగా ముగిసిన ఆ కొత్త జీవితపు ప్రయాణానికి విషాద సాక్ష్యాలుగా నిలిచాయి.
వివరాల్లోకి వెళితే.. నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, స్కూల్ టీచర్ అయిన హిమాన్షిల వివాహం సరిగ్గా ఆరు రోజుల క్రితం ఏప్రిల్ 16న ముస్సోరీలో జరిగింది. ఏప్రిల్ 6న వీరి నిశ్చితార్థం జరిగింది. వాస్తవానికి వారు హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. కానీ, వీసా రావడంలో ఆలస్యం కావడంతో కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శ్రీనగర్ చేరుకున్న 48 గంటల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది. మంగళవారం నాడు పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.
ఇంకా పెళ్లి గాజులు కూడా తీయని హిమాన్షి తన భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పీటీఐ వార్తా సంస్థ ఈ ఫోటోను శ్రీనగర్లోని తమ స్ట్రింగర్ ద్వారా సేకరించి విడుదల చేసింది. "వినయ్ను ఉగ్రవాదులు చంపేశారని హిమాన్షి తన సోదరుడు లక్షిత్కు ఫోన్ చేసి చెప్పడంతో బుధవారం మధ్యాహ్నం మాకు విషయం తెలిసింది" అని హిమాన్షి మేనత్త బబిత తెలిపారు. మొదట అది నిజం కాకూడదని భావించినా, ఫోటోలు వార్తల్లో రావడంతో నిర్ధారణ అయిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
వినయ్, హిమాన్షీల కుటుంబాలకు చాలాకాలంగా పరిచయం ఉందని, వినయ్ తండ్రి రాజేష్ నర్వాల్, హిమాన్షి తండ్రి మంచి స్నేహితులని బంధువులు తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఇరు కుటుంబాల పెద్దలు పహల్గామ్కు బయలుదేరారు. వినయ్ భౌతికకాయాన్ని మంగళవారం ఢిల్లీకి, అక్కడి నుంచి అంత్యక్రియల నిమిత్తం స్వస్థలమైన హర్యానాలోని కర్నాల్కు తరలించారు. కర్నాల్లోని వినయ్ ఇంట్లో ఇంకా అతని పెళ్లి షేర్వాణీ వేలాడుతూనే ఉండటం, ముస్సోరీ నుంచి తెచ్చిన అతని ప్రయాణపు బ్యాగ్ పూర్తిగా సర్దకపోవడం.. అర్ధాంతరంగా ముగిసిన ఆ కొత్త జీవితపు ప్రయాణానికి విషాద సాక్ష్యాలుగా నిలిచాయి.