నిమ్స్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై స్పందించిన దామోదర రాజనర్సింహ
- ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని వెల్లడి
- ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదన్న దామోదర రాజనర్సింహ
- నిమ్స్ డైరెక్టర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు వెల్లడి
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులందరినీ సురక్షిత గదుల్లోకి తరలించినట్లు తెలిపారు. నిమ్స్ అత్యవసర విభాగం ఐదో అంతస్తులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు.