Damodar Rajnarasimha: నిమ్స్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై స్పందించిన దామోదర రాజనర్సింహ
- ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని వెల్లడి
- ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదన్న దామోదర రాజనర్సింహ
- నిమ్స్ డైరెక్టర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు వెల్లడి
హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఐదో అంతస్తులో సంభవించిన ప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ఆస్తి నష్టం కూడా స్వల్పంగానే వాటిల్లిందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నిమ్స్ డైరెక్టర్తో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులందరినీ సురక్షిత గదుల్లోకి తరలించినట్లు తెలిపారు. నిమ్స్ అత్యవసర విభాగం ఐదో అంతస్తులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు.
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులందరినీ సురక్షిత గదుల్లోకి తరలించినట్లు తెలిపారు. నిమ్స్ అత్యవసర విభాగం ఐదో అంతస్తులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు.