విద్యార్థులతో మద్యం తాగించిన టీచర్‌... వీడియో వైర‌ల్‌

  • మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఘ‌ట‌న‌
  • విద్యార్థుల‌తో క‌లిసి మ‌ద్యం సేవించిన లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ అనే టీచ‌ర్‌
  • వీడియో వైర‌ల్ కావ‌డంతో స‌స్పెండ్ అయిన వైనం
ఉపాధ్యాయ వృత్తికి క‌ళంకం తెచ్చేలా ప్రవర్తించాడో ప్రభుత్వ టీచ‌ర్‌. ఏకంగా త‌ర‌గ‌తి గదిలో మద్యం సేవించాడు. అంతేగాక విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట‌ వైర‌ల్ కావ‌డంతో ఉపాధ్యయుడిని స‌స్పెండ్ చేశారు.  

లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ అనే ఆ ఉపాధ్యాయుడు బర్వారా బ్లాక్ పరిధిలోని ఖిర్హాని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో సింగ్ కొంద‌రు విద్యార్థుల‌కు టీ కప్పుల్లో మద్యం పోసి తాగించ‌డం ఉంది. మద్యం తాగే ముందు అందులో నీళ్లు కలపాలని ఒక స్టూడెంట్‌కు చెప్పాడు. మద్యం ఉన్న కప్పులో నీళ్లు పోయగా ఆ విద్యార్థి దానిని తాగాడు.

కాగా, ఉపాధ్యాయుడు నవీన్‌ ప్రతాప్‌ సింగ్‌ తరగతి గదిలో విద్యార్థులతో మద్యం తాగించిన వీడియో నెట్టింట‌ వైరల్ అయింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ దిలీప్ కుమార్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో... ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఓపీ సింగ్‌ను ఆదేశించారు. దాంతో ఎంపీ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నిబంధనల ప్రకారం దుష్ప్రవర్తన ఆరోపణలపై లాల్ నవీన్ ప్రతాప్ సింగ్‌ను సస్పెండ్ చేశారు.


More Telugu News