స్టాలిన్ కీలక నిర్ణయం... రాష్ట్ర స్వయంప్రతిపత్తిపై సూచనలకు కమిటీ
- గవర్నర్తో విభేదాల నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం
- స్వయంప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయనున్న కమిటీ
- పెండింగు బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం
పలు బిల్లుల ఆమోదంపై తమిళనాడు గవర్నర్, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయి. గవర్నర్ ఆమోదం లేకుండానే 10 చట్టాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ బిల్లులపై సుప్రీంకోర్టులో సైతం స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది.
పెండింగులో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వాటికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్వయంప్రతిపత్తిపై సూచనల కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.