Arjun S/O Vyjayanthi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్యాణ్ రామ్, విజయశాంతి అండ్ టీం

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'అర్జున్ S/o వైజయంతి'. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కథానాయికగా సయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్, విజయశాంతి అండ్ టీం ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు చిత్ర బృందానికి ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.