Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం భూమిపూజ వీడియో పోస్టు చేసిన మంత్రి నారా లోకేశ్

- అమరావతిలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం
- నేడు భూమి పూజ
- హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సంకల్పించారు. ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను నారా లోకేశ్ తన యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేశారు.
చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో సొంతంగా 5 ఎకరాల స్థలం కొనుక్కున్నారు. సచివాలయం వెనుక ఉన్న ఈ-9 రహదారికి పక్కనే ఈ స్థలం ఉంది. ఓ రైతు నుంచి ఈ స్థలం కొనుగోలు చేశారు.