జగన్ ఇరుక్కున్నారు.. తప్పించుకోలేరు: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
- జగన్ హయాం నాటి 32 కేసులు కొలిక్కి వచ్చాయన్న ఆదినారాయణరెడ్డి
- వైఎస్సార్ హయాం నాటి మూడు ముఖ్యమైన కేసుల్లో జగన్ ఇరుక్కుపోయారని వ్యాఖ్య
- సుధీర్రెడ్డి, అవినాశ్ రెడ్డి ఆటలు ఇక సాగవన్న ఎమ్మెల్యే
అభివృద్ధిలో జమ్మలమడుగు దేశంలోని మొదటి నాలుగు స్థానాల్లో నిలవబోతోందని ఆదినారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై, సుధీర్రెడ్డి, అవినాశ్ రెడ్డి ఆటలు సాగవని హెచ్చరించారు. మరోమారు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆస్తుల కల్పన, పరిరక్షణ కోసమే కేంద్రం వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ భూపేష్రెడ్డి మరింత కష్టపడితే తన కంటే పెద్ద నాయకుడు అవుతారని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని స్థానాల్లోనూ గెలుస్తామని ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.