తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతాదయాకర్ రెడ్డి నియామకం

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • చైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యుల నియామకం
  • సభ్యులలో గోగుల సరిత, వచన్ కుమార్ తదితరులు
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. కంచర్ల వందన గౌడ్, బి. అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి. వచన్ కుమార్ కమిషన్ సభ్యులుగా ఉంటారు.


More Telugu News