మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్ల ప్రకటనలు... స్పందించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- కొన్ని మెట్రో రైళ్లపై ప్రకటనలు ఉన్నట్లు దృష్టికి వచ్చిందన్న ఎన్వీఎస్ రెడ్డి
- ఇలాంటి ప్రకటనలను వెంటనే తొలగించాలని ఆదేశించామని వెల్లడి
- ఈరోజు మెట్రో సేవల అనంతరం తొలగిస్తామని స్పష్టీకరణ
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన నటీనటులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రకటనలు ఉండటాన్ని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. దాంతో, మెట్రో రైళ్ల మీద ఉన్న ప్రకటనలపై ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు.