అమరావతి, తిరుపతి, విశాఖలో లులు మాల్స్
- ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంస్థ
- మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వెల్లడి
- నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు
- అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం
కాగా, రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పునఃప్రారంభించబోతున్నట్టు ఇటీవల ప్రభుత్వం తెలిపింది. ఇదే విషయాన్ని మంత్రివర్గానికి తెలియజేశారు. ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధానితోపాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కూడా చంద్రబాబు కలుస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న నిధుల జాబితాను తీసుకెళ్లనున్నారు. వాటికి నిధులు విడుదల చేయాల్సిందిగా నిర్మలను కోరనున్నారు.