తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్... విజయశాంతికి టికెట్
- తెలంగాణలో ఖాళీ కానున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు
- ఒకటి స్థానం బీఆర్ఎస్ పరం!
- మిగిలిన మూడింటికి నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
- మరో ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్
కాగా, ఖాళీ కానున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ కు దక్కనుండగా... నాలుగు కాంగ్రెస్ కు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో, ముగ్గురితో జాబితా ప్రకటించిన ఏఐసీసీ... నాలుగో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 20న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.