వల్లభనేని వంశీని పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు
- వంశీని మూడు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
- విజయవాడ పరిధిలోనే విచారించాలని కండిషన్
- న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి
అయితే, పోలీసులకు కోర్టు కొన్ని షరతులు విధించింది. విజయవాడ పరిధిలోనే వంశీని విచారించాలని కోర్టు తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని తెలిపింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు, వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీకి పడుకోవడానికి బెడ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.