సంకెళ్లతో మోదీ కార్టూన్.. తమిళ వెబ్ పత్రికపై కేంద్రం వేటు
- భారతీయ వలసదారులకు సంకెళ్లు వేసి పంపుతున్న అమెరికా
- ట్రంప్ ముందు మోదీ సంకెళ్లతో కూర్చున్నట్టు కార్టూన్ ప్రచురించిన ‘వికటన్‘
- కేంద్ర సమాచార మంత్రికి ఫిర్యాదు చేసిన తమిళనాడు బీజేపీ చీఫ్
- రెండు రోజులుగా నిలిచిపోయిన ‘వికటన్‘ ప్రసారాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు మోదీ సంకెళ్లతో కూర్చున్నట్టుగా ఉన్న కార్టూన్ను ప్రచురించింది. ఇది మోదీని కించపరిచేలా ఉందంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ నెల 15న కేంద్ర సమాచార మంత్రి ఎల్.మురుగన్కు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్కు ఫిర్యాదు చేశారు. దీంతో గత రెండు రోజులుగా ‘వికటన్’ పోర్టల్ ప్రసారాలు నిలిచిపోయాయి.
దీంతో స్పందించిన ‘వికటన్’ యాజమాన్యం.. వెబ్సైట్ బ్లాక్ కావడానికి గల కారణాలు తెలుసుకుంటున్నట్టు తెలిపింది. కేంద్ర సమాచార మంత్రిత్వశాఖను సంప్రదిస్తామని పేర్కొంది. మరోవైపు, వెబ్సైట్ను నిలిపివేయడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళిగ వెట్రి కళగం పార్టీ నేత, ప్రముఖ నటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు చీఫ్ సెల్వపెరుంతగై సహా పలువురు ఖండించారు. బీజేపీ ఫాసిస్టు ధోరణికి ఇంతకుమించిన ఉదాహరణ అక్కర్లేదని దుమ్మెత్తి పోశారు.