ఎమ్మెల్సీ ఎన్నికలు... సమన్వయకర్తలను నియమించిన పవన్ కల్యాణ్
- రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
- పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించిన పవన్
- విజయవాడ సమన్వయకర్తగా అమ్మిశెట్టి వాసు
ఎన్నికలకు ముందు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జనసేన సమన్వయర్తలు వీరే:
- రాజమండ్రి - యర్నాగుల శ్రీనివాసరావు
- కాకినాడ - తుమ్మల రామస్వామి
- అమలాపురం - బండారు శ్రీనివాసరావు
- నరసాపురం - చన్నమల్ల చంద్రశేఖర్
- ఏలూరు - రెడ్డి అప్పలనాయుడు
- మచిలీపట్నం - బండి రామకృష్ణ
- విజయవాడ - అమ్మిశెట్టి వాసు
- గుంటూరు - నయబ్ కమల్
- నరసరావుపేట - వడ్రాణం మార్కండేయ బాబు