సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమెడియన్ పృథ్వీ
- ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వ్యాఖ్యలు
- భారీ స్థాయిలో పృథ్వీని ట్రోల్ చేస్తున్న వైసీపీ శ్రేణులు
- ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటుడు
ఫోన్ కాల్స్, మెసేజ్ లతో వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్ నెంబరును వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టారని, దాదాపు 1,800 కాల్స్ చేయించారని వివరించారు. తనను, తన కుటుంబ సభ్యులను కూడా తిట్టారని... అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్చి వచ్చిందని వాపోయారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించానని పృథ్వీ వెల్లడించారు.
కాగా, వేధింపుల అంశంపై త్వరలోనే ఏపీ హోంమంత్రి అనితను కలుస్తానని, వేధింపులకు పాల్పడిన వారిపై రూ.1 కోటి పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.