విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలపై కేంద్రమంత్రితో చర్చించా: పురందేశ్వరి
- ఢిల్లీలో కేంద్రమంత్రి కుమారస్వామితో పురందేశ్వరి భేటీ
- స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావించానని వెల్లడి
- ప్లాంట్ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారని వివరణ
ఈ సందర్భంగా పురందేశ్వరి... కుమారస్వామికి వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
