తిరుమల అతిథిగృహంలో దంపతుల బలవన్మరణం
- తిరుమలలోని నందకం అతిథిగృహంలో దంపతులు ఆత్మహత్య
- చీరతో ఫ్యాన్కు ఉరివేసుకున్న శ్రీనివాసులు నాయుడు, అరుణ
- మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఈ దంపతులు నిన్న ఉదయం రూమ్ తీసుకున్నారు. అయితే, వారు రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బందికి అనుమానం వచ్చి కిటికీలు తెరిచి చూశారు. దాంతో వారు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా, శ్రీనివాసులు దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.