పేద, మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలి: మోదీ
- నేటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు
- అన్ని అంశాలపై చర్చ జరగాలన్న మోదీ
- వికసిత్ భారత్ కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందన్న ప్రధాని
రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్ఫామ్ లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని మోదీ తెలిపారు. ఇన్నొవేషన్, ఇన్ క్లూజన్, ఇన్వెస్ట్ మెంట్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. అంతర్జాతీయంగా మన దేశ పరపతి పెరుగుతోందని చెప్పారు. 2047 కల్లా మన దేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు.