అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
- ఇప్పటి వరకు 40 పనులకు టెండర్లు పిలిచామన్న నారాయణ
- ప్రపంచ టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండాలనేదే లక్ష్యమని వ్యాఖ్య
- 250 మీటర్ల ఎత్తుతో అసెంబ్లీని నిర్మిస్తామన్న మంత్రి
ఇప్పటి వరకు 40 పనులకు టెండర్లను పిలిచామని నారాయణ తెలిపారు. అమరావతిని ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల నిర్మాణానికి నార్మన్ ఫోస్టర్ చేత డిజైన్ చేయించామని వెల్లడించారు. 2019కి ముందే టీడీపీ హయాంలో జడ్జ్ లు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,053 ఫ్లాట్ లతో అపార్ట్ మెంట్ల పనులు ప్రారంభించామని తెలిపారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తామని... సమావేశాలు లేని రోజుల్లో దాన్ని టూరిజం స్పాట్ గా మార్చేలా డిజైన్లు రూపొందించామని చెప్పారు. తాగునీటి పైపులు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ లో ఉండేలా చేస్తున్నామని తెలిపారు.