వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే ఎలా?: కర్నూలు జిల్లా టీడీపీ నేత
- పార్టీ కోసం జైళ్లకు పోయినోళ్లు, ఆర్థికంగా నష్టపోయినోళ్లు ఉన్నారన్న తిక్కారెడ్డి
- ఈ క్రమంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టీకరణ
- సొంత కార్యకర్తల నుంచి లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణ
శనివారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ కొంతమంది సొంత పార్టీ కార్యకర్తల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్ల పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు టీడీపీ కార్యకర్తల వద్ద డీలర్ దుకాణం పేరుతో రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. కర్నూలులో జరిగే అక్రమాలు, ముడుపుల వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతామన్నారు.