రాష్ట్ర ప్రజలకు ఇక అన్నీ మంచి రోజులే: సీఎం చంద్రబాబు
- విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ
- నేడు అధికారికంగా ప్రకటించిన కేంద్రం
- ఇది చారిత్రాత్మక నిర్ణయం అంటూ చంద్రబాబు హర్షం
- మోదీకి కృతజ్ఞతలు తెలిపిన వైనం
విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల సానుకూలంగా స్పందించి ప్యాకేజీ ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని... కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని, ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న అంశం అని తెలిపారు. విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు.