APSRTC: హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్

Special buses from Hyderabad to Andhra Pradesh for Sankranthi announced by APSRTC
  • సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు
  • జనవరి 9 నుంచి 13 మధ్య 2,400 స్పెషల్ సర్వీసులు 
  • అనదపు ఛార్జీలు లేకుండానే నిర్వహణ
  • ప్రకటించిన ఏపీఎస్‌ఆర్టీసీ
సంక్రాంతి పండుగకు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 9 నుంచి జనవరి 13 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 2,400 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది.

ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. పండుగ వేళ ప్రజలపై ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో అధికారులు తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, మాచర్లతో పాటు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లే సాధారణ బస్సులు, స్పెషల్ బస్సులు హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్‌కు ఎదురుగా ఉన్న సీబీఎస్ నుంచి బయలుదేరతాయని అధికారులు తెలిపారు.
APSRTC
Andhra Pradesh
Hyderabad
Sankranti

More Telugu News