Bangladesh: త్రిపురకు రూ. 200 కోట్ల బకాయి పడిన బంగ్లాదేశ్.. విద్యుత్తు సరఫరా నిలిచిపోనుందా?

Bangladesh owes Rs 2000000000 to this Indian state Tripura
  • విద్యుత్తు సరఫరా కోసం త్రిపుర, బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం
  • రోజూ 60-70 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్న త్రిపుర
  • ఇప్పటికే పేరుకుపోయిన రూ. 200 కోట్ల బకాయిలు
  • సరఫరాను ఆపేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న త్రిపుర సీఎం మాణిక్ సాహా
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లు, అక్కడి హిందూ సమాజంపై అల్లరిమూకల దాడి తదనంతర పరిణామాలతో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అల్లర్ల నేపథ్యంలో భారత్‌కు వచ్చి తలదాచుకున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ అభ్యర్థించింది.

ఈ నేపథ్యంలో తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమకు రూ. 200 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. 

బంగ్లాదేశ్‌కు 60-70 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌కు త్రిపుర విద్యుత్తును సరఫరా చేస్తోంది. అయితే, ఆ మేరకు డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. దీనికితోడు ఈ బకాయిలకు ప్రతిరోజు మరింత మొత్తం వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మాణిక్ సాహా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ త్వరలోనే బకాయి సొమ్ము చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరా కొనసాగించాలంటే డబ్బులు చెల్లించకతప్పదని పేర్కొన్నారు. 
Bangladesh
Tripura
Tripura State Electricity Corporation Limited
Bangladesh Power Development Board
Manik Saha

More Telugu News