'వన్ నేషన్ - వన్ ఎలెక్షన్'కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం
- జమిలికి ఆమోదముద్ర వేసిన కేబినెట్
- ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది.
తొలి దశలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని... ఆ తరువాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది.