మహీంద్రా కంపెనీ కార్లు కొనాలనుకుంటున్నారా?.. వచ్చే నెలలో పెరగనున్న ధరలు
- కార్ల రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటన
- అన్ని పొర్ట్ఫొలియోల్లోని కార్ల ధరల పెంపు
- విడిభాగాల ధరల పెరుగుదలతో కస్టమర్లపై భారం మోపక తప్పడంలేదని వెల్లడి
కాగా ధరల పెంచబోతున్నట్టు మారుతీ సుజుకి, హ్యుందాయ్ మోటార్, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ కంపెనీలు కూడా ఇప్పటికే ప్రకటించాయి. జనవరి 1, 2025 నుంచి తమ వాహనాలపై ధరల పెంపు ఉంటుందని తెలిపాయి. ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయని, విడి భాగాల ధరలు కూడా పెరగడంతో ధరల పెంపు తప్పడం లేదని కంపెనీలు వెల్లడించాయి. మహీంద్రా కంపెనీ కూడా ఇవే కారణాలను పేర్కొంది. పెరిగిన ధరల భారాన్ని కొంతమేర వినియోగదారులపై మోపక తప్పడం లేదని వివరించింది. కాగా మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో-ఎన్, ఎక్స్యూవీ700, థార్ రాక్స్ కార్లు అత్యధికంగా అమ్ముడుపోతుంటాయి. నవంబర్లో దాదాపు 16 శాతం వృద్ధితో మొత్తం 46,000 కంటే ఎక్కువ ఎస్యూవీ కార్లను విక్రయించినట్టు తెలిపింది.