విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ సీఎస్ల భేటీ... తేలని విద్యుత్ బకాయిల అంశం
- దాదాపు రెండు గంటల పాటు సాగిన అధికారుల సమావేశం
- లేబర్ సెస్ పంపకానికి కుదిరిన అంగీకారం
- డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయం
రూ.861 కోట్ల మేర లేబర్ సెస్ను ఏపీ-తెలంగాణ మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. ఈ పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. 9, 10వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల అంశం కూడా తేలలేదు.
ఉద్యోగుల మార్పిడిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయించారు. విభజన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని సీఎస్లు నిర్ణయించారు.