Telangana: పులివెందులలో వైసీపీ నేతల ఆధీనంలోని కార్లను విడిపించిన తెలంగాణ పోలీసులు!

Telangana Police found Sangareddy man cars in Pulivendula
  • సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్ కార్లను అద్దెకు తీసుకెళ్లిన వైసీపీ నేతలు
  • కార్లు అడిగితే కొట్టారని మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసిన సతీశ్ కుమార్
  • పులివెందుల పోలీసుల సాయంతో కార్లను గుర్తించిన తెలంగాణ పోలీసులు
  • సతీశ్ కుమార్‌కు కార్లను అప్పగించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా పులివెందులలో... తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్ కార్లను పోలీసులు విడిపించారు. ఈ కార్లు పులివెందులలో అక్కడి వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నాయి. తెలంగాణ పోలీసులు వాటిని విడిపించారు. ఈ కార్లను దాదాపు మూడేళ్లుగా వైసీపీ నేతలు వినియోగిస్తున్నారు.

పులివెందుల మెడికల్ కాలేజీ కోసమని చెప్పి సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్‌కు చెందిన ఆరు కార్లను అక్కడి వైసీపీ నేతలు రెంటల్ కాంట్రాక్ట్‌పై తీసుకెళ్లారు.

ఆ కార్లను తీసుకెళ్లిన వైసీపీ నేతల ఆచూకీ సతీష్ కుమార్‌కు లభించలేదు. జీపీఎస్ ట్రాక్ చేసి చూడగా కార్లు వేంపల్లెలో ఉన్నట్లుగా గుర్తించాడు. అక్కడకు వెళ్ళి తన కార్లను ఇచ్చేయాలని తాను అడగగా... ఇడుపులపాయలో తనను బంధించి కొట్టారని సతీశ్ కుమార్ ఆరోపించాడు. ఈ మేరకు 2021లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసులో కదలిక వచ్చింది. కడప పోలీసుల సాయంతో తెలంగాణ పోలీసులు నాలుగు రోజుల పాటు పులివెందుల, వేంపల్లెలో తిరిగారు. కార్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని సతీష్ కుమార్‌కు అప్పగించారు.
Telangana
Andhra Pradesh
YSRCP
Sangareddy District

More Telugu News