కేఏ పాల్ పిటిషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ పాల్ పిటిషన్
- ఈ అంశం ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉందన్న హైకోర్టు
- ప్రస్తుతం తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టీకరణ
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... పిటిషన్ ను కొట్టివేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉందని హైకోర్టు తెలిపింది. ఈ అంశంపై తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల వెలువరించిన తీర్పులో పేర్కొన్నామని చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే సదరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించలేమని స్పష్టం చేసింది.