శ్రీవారి ఆలయం ముందు వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడి ఫొటోషూట్!

YCP leader Vamsidhar Reddy photoshoot at Tirumala temple
   
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు వంశీధర్‌రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఫొటోషూట్‌తో హల్‌చల్ చేశారు. ఆలయ ప్రాంగణంలో నలుగురు ఫొటోగ్రాఫర్లతో ఫోటోషూట్‌ చేయించుకున్నారు. ఆయన ఫొటోషూట్‌తో భక్తులు ఇబ్బంది పడ్డారు. 

ఈ ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై వంశీధర్‌రెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. ఇంత జరిగినా టీటీడీ విజిలెన్స్ విభాగం పట్టించుకోనట్టు వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన వంశీధర్‌రెడ్డి, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Advertisement
YS Avinash Reddy
Vamsidhar Reddy
TTD
Photoshoot

More Telugu News