ఒకే వేదికపైకి నయనతార, ధనుశ్.. నెట్టింట వీడియో వైరల్!
- టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహం
- ఒకే వేదికపై ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచిన నయనతార, ధనుశ్
- వీడియోను షేర్ చేసిన నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్
గత వారం రోజులుగా కోలీవుడ్ నటులు నయనతార, ధనుశ్ వివాదం నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దానికి కారణం నయనతార తన డాక్యుమెంటరీలో వాడిన మూడు సెకన్ల నిడివి కలిగిన క్లిప్పింగ్. దాంతో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఒకరినొకరు దోషిగా చూపిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకకి ఇద్దరు స్టార్లు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.
టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహ వేదికపై ఇలా నయన్, ధనుశ్ ప్రత్యక్షమయ్యారు. గురువారం ఆకాశ్ భాస్కర్ పెళ్లికి తొలుత ధనుష్ హాజరవగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్తో కలిసి వచ్చారు.
ఇక సినీ పరిశ్రమకు చెందినవారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుశ్, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుశ్ ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్నారు.
ఈ వీడియోను నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇరువురు అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
నయనతార, ధనుశ్ మధ్య వివాదం ఇదే..
నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లోని ఆసక్తికరమైన విషయాల్ని‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ‘నేనూ రౌడీనే’ అనే సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్ను వాడారు. ఈ సినిమాకి ధనుశ్ నిర్మాత. అయితే, తన అనుమతి లేకుండా ఆ క్లిప్పింగ్ను వాడారని కోప్పడిన ధనుశ్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపారు. తాము ధనుశ్ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం రెండేళ్లపాటు ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదంటూ నయనతార ఆరోపించారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.
టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహ వేదికపై ఇలా నయన్, ధనుశ్ ప్రత్యక్షమయ్యారు. గురువారం ఆకాశ్ భాస్కర్ పెళ్లికి తొలుత ధనుష్ హాజరవగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్తో కలిసి వచ్చారు.
ఇక సినీ పరిశ్రమకు చెందినవారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుశ్, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుశ్ ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్నారు.
ఈ వీడియోను నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇరువురు అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
నయనతార, ధనుశ్ మధ్య వివాదం ఇదే..
నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లోని ఆసక్తికరమైన విషయాల్ని‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ‘నేనూ రౌడీనే’ అనే సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్ను వాడారు. ఈ సినిమాకి ధనుశ్ నిర్మాత. అయితే, తన అనుమతి లేకుండా ఆ క్లిప్పింగ్ను వాడారని కోప్పడిన ధనుశ్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపారు. తాము ధనుశ్ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం రెండేళ్లపాటు ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదంటూ నయనతార ఆరోపించారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.
More Telugu News
అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఉన్న గందరగోళానికి తెరదించిన ప్రభుత్వం
![]()
అన్నెసీ ఫెస్టివల్ కు 'బాహుబలి'... యానిమేషన్ అనేది హద్దులు లేని కాన్వాస్ అన్న రాజమౌళి
![]()
దేవుడు అన్నీ చూస్తున్నాడు.. మత్స్యకారుల హక్కుల్ని చంద్రబాబు తాత కూడా తీసుకోలేరు: జగన్
![]()
విద్యాశాఖ మంత్రిగా... నారా లోకేశ్ కృషికి దక్కిన ఇంటర్ 'ఫలితం'
![]()
ఉదయనిధి స్టాలిన్ ఆస్తులపై ఐటీ విచారణ.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం
![]()
ఇరాన్తో యుద్ధంపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?
![]()
టీసీఎస్లో మత మార్పిడి కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
![]()
కుమార్తెల పెళ్లిళ్లు, రాజకీయాలపై నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
![]()
అవకాశం వస్తే చిరంజీవి సినిమాలో విలన్గా చేస్తా: 'ఎఫ్.సి.ఏ' మీట్ ది ప్రెస్ లో హీరో రాజశేఖర్
![]()
పూడి శ్రీహరి అరెస్ట్... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న వైసీపీ
![]()
పవన్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్ అనుదీప్ అరెస్ట్
![]()
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
![]()
బీహార్లో కొత్త శకం.. తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం
![]()
రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయాన్ని రోహిత్ శర్మకే వదిలేసిన మేనేజ్మెంట్!
![]()
కాల్పుల విరమణ పొడిగింపుపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
![]()