హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు
- నేరుగా రాజ్ భవన్ చేరుకున్న ద్రౌపది ముర్ము
- రేపు లోక్ మంథన్-2024లో పాల్గొననున్న ద్రౌపది ముర్ము
బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి వెళ్లనున్నారు. రేపు శిల్పకళా వేదికలో జరుగుతోన్న లోక్ మంథన్-2024 కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.