Jagan: శృంగేరి శారదా పీఠానికి వెళ్లనున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం విజయవాడలో పర్యటించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సాయంత్రం 4.30 గంటలకు ఆయన విజయవాడకు బయల్దేరుతారు.
విజయవాడ గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని ఆయన సందర్శించనున్నారు. శారదా పీఠంలో శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలవనున్నారు. ఈ మేరకు వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించింది.
విజయవాడ గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని ఆయన సందర్శించనున్నారు. శారదా పీఠంలో శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలవనున్నారు. ఈ మేరకు వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించింది.