మేం నలుగురం అంటూ రోహిత్ శర్మ పోస్ట్
- ఫ్యామిలీ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రోహిత్ శర్మ
- నిన్న మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ శర్మ భార్య రితికా
- భార్య కాన్పు నేపథ్యంలో భారత్లోనే ఉండిపోయిన రోహిత్ శర్మ
2015 డిసెంబర్ 13న వీరి పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం. 2018 డిసెంబర్ 30న వీరి జీవితంలోకి సమైరా వచ్చింది. అప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఆడకూతురు జన్మించింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఆ దేశానికి చేరుకుంది. భార్య రెండో కాన్పు నేపథ్యంలో రోహిత్ శర్మ భారత్లోనే ఉండిపోయాడు. టీమిండియా ప్లేయర్లు సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ... రోహిత్ శర్మకు శుభాకాంక్షలు చెప్పారు.