నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్.. ఏడాదిలో రెండోసారి
- ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామన్న ప్రభుత్వం
- ఈ ఏడాది మేలో నిర్వహించిన టెట్కు 2.35 లక్షల మంది హాజరు
- జనవరిలో పరీక్షలు ఉండే అవకాశం
- టెట్-1 పేపర్కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు
మేలో నిర్వహించిన టెట్కు 2.35 లక్షల మంది హాజరు కాగా 1.09 లక్షల మంది పాసయ్యారు. ఇక, టెట్-1 పేపర్కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కోసం టెట్ అర్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ నిర్వహించడం ఇది రెండోసారి.