జియోఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. దీపావళి స్పెషల్ ఆఫర్ ప్రకటన
- 28 రోజుల వ్యాలిడిటీతో చవకగా రూ.153 ప్లాన్ ప్రవేశపెట్టిన టెలికం దిగ్గజం
- 0.5 జీబీ రోజువారీ డేటా.. నెలకు 300 ఎస్ఎంఎస్లు లభ్యం
- జియో టీవీ, జియో సినిమా సబ్స్క్రిప్సన్స్ ఉచితం
జియోఫోన్ యూజర్లకు రూ. 153 ప్లాన్తో పాటు అవసరమైన అదనపు సేవల కోసం కూడా తక్కువ ధరలో ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల రేట్లు రూ.75, రూ.91, రూ.125, రూ.186, రూ.223గా ఉన్నాయి. ఈ ప్లాన్లు అన్నీ జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తాయి. స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వర్తించవని రిలయన్స్ జియో తెలిపింది.
కాగా ప్రైవేటు టెలికం ప్రొవైడర్లు మూడు నెలల క్రితం టారీఫ్ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఫీచర్ ఫోన్ల రీఛార్జులు కూడా భారీగా పెరిగాయి. దీంతో లక్షలాది మంది వినియోగదారులు రీఛార్జ్ చేసుకోవాలంటేనే వెనక్కి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దీపావళి సీజన్లో కస్టమర్లు నిరంతరాయ సేవలు పొందాలనే ఉద్దేశంతో జియో ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది.