వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించండి.. సీఎం చంద్రబాబుకు ముస్లిం సంఘాల వినతి
- ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు
- కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు యాక్ట్ చట్ట సవరణపై తమ అభ్యంతరాలు వివరించిన ప్రతినిధులు
- చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన సీఎం చంద్రబాబు
కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుందని.. ఈ చర్య ముస్లిం వర్గ హక్కులు, మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, ఆందోళనను వివరించారు. వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించ వద్దని, పార్లమెంట్లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ముస్లిం ప్రతినిధులకు తెలిపారు.