మరో రెండు విమానాలు, ఒక రైలుకు బాంబు బెదిరింపులు`
- నిబంధనల ప్రకారం రెండు విమానాల్లోనూ తనిఖీలు
- ముంబై-హౌరా మెయిల్ను పేల్చివేస్తామంటూ బెదిరింపు సందేశం
- తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదని వెల్లడి
కాగా సోమవారం ఉదయం ముంబై-న్యూయార్క్ వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీకి మళ్లించిన విషయం తెలిసిందే. 239 మంది ప్రయాణీకులు ఉన్న ఈ విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో భద్రంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.
రైలుకు బాంబు బెదిరింపు
విమానాల తరహాలోనే అంతకుముందు ముంబై-హౌరా మెయిల్ను పేల్చివేస్తామంటూ రైల్వే అధికారులకు బెదిరింపులు వచ్చాయి. టైమర్ బాంబుతో పేల్చివేస్తామని బెదిరించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో 12809 ట్రైన్ను జల్గావ్ స్టేషన్లో ఆపివేశారు. భద్రతా తనిఖీలు చేపట్టారు. అయితే రైలులో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. దీంతో రైలు గమ్యస్థానానికి బయలుదేరిందని సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.