అభిమాని కోరిక తీర్చిన ఏపీ సీఎం చంద్రబాబు

chandrababu showed humanity at renugunta airport handed over 5 lakhs cheque
  • రేణిగుంట విమానాశ్రయం వద్ద అభిమానితో ఫోటో దిగిన సీఎం చంద్రబాబు 
  • అభిమాని సురేంద్రబాబు వైద్య ఖర్చుల కోసం రూ.5లక్షల సాయం అందజేసి భరోసా ఇచ్చిన చంద్రబాబు
  • అభిమాన నాయకుడి పలకరింపుతో సంతోషం వ్యక్తం చేసిన సురేంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తనతో ఫోటో దిగాలన్న అభిమాని కోరికను చంద్రబాబు తీర్చారు. రేణిగుంటకు చెందిన మానసిక వికలాంగుడైన పసుపులేటి సురేంద్రబాబు (30) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి చిన్న తనం నుంచి చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తాను చనిపోయే లోపు అభిమాన నాయకుడు చంద్రబాబుతో ఫోటో దిగాలన్న కోరిక సురేంద్రబాబుకు ఉంది. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా చంద్రబాబు దృష్టికి వెళ్లింది. 

ఈ నేపధ్యంలో తిరుమల పర్యటన ముగించుకుని శనివారం రేణిగుంటలో విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వెళుతున్న చంద్రబాబు విమానాశ్రయం గేటు వద్ద వాహనం దిగి సురేంద్రబాబును పరామర్శించారు. ఫోటో దిగాలన్న అతని కోరికను నెరవేర్చడంతో పాటు సురేంద్రబాబుకు చికిత్స నిమిత్తం రూ.5లక్షల చెక్కును అందించారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని, భయపడొద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తమ అభిమాన నేత ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగడంతో సురేంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.  
Go Back to Shorts
Chandrababu
Renugunta
ap news

More Telugu News