శ్రీవారి లడ్డూ ప్రసాదం.. చంద్రబాబుకు నివేదిక సమర్పించిన ఈవో
- దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ వివాదం
- చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టీటీడీ ఈవో శ్యామలరావు
- విస్తృత సంప్రదింపుల అనంతరం ఆలయ సంప్రోక్షణ విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయం
ఈవో అందించిన నివేదికపై నిన్న మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారులు, అర్చకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఆలయ సంప్రోక్షణ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల అనంతరం చర్యలు తీసుకోవాలని సూచించారు.