మోదీ పుట్టినరోజు నాడు అజ్మీర్ దర్గా ఆధ్వర్యంలో 4 వేల కిలోల శాకాహారం పంపిణీ కార్యక్రమం
- బియ్యం, నెయ్యి, పండ్లతో పదార్థాన్ని తయారు చేస్తామన్న దర్గా ప్రతినిధులు
- ఈ పదార్థాన్ని భక్తులు, పేదలకు అందిస్తామని వెల్లడి
- మోదీ కోసం ప్రార్థనలు చేస్తామన్న దర్గా ప్రతినిధులు
మోదీ జన్మదినం సందర్భంగా దేశంలోని పలు ప్రార్థనామందిరాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని దర్గా ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా తాము 4,000 కిలోల శాకాహారాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం 'సేవా పఖ్వాడా' వేడుకల్లో భాగంగా చేస్తున్నట్లు చెప్పారు.
దర్గాలో 550 ఏళ్లుగా ప్రసిద్ధ బిగ్ షాహీ దేగ్ (పెద్ద పాత్ర)లో ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నారు. ఈ శాకాహారాన్ని అందులో తయారు చేయనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ కోసం ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. శాంతి, సంక్షేమం, ఐక్యత కోసం కూడా ప్రార్థనలు చేస్తామని తెలిపారు.