లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గతంలోనే అదానీని ఒప్పించాం: నారా లోకేశ్
- చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అన్న లోకేశ్
- ఏపీకి మళ్లీ పెట్టుబడిదారులు వస్తున్నారని వ్యాఖ్య
- వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా భూములను ఆక్రమించారని విమర్శ
వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా భూములను ఆక్రమించారని... ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో త్వరలోనే వివరాలతో సహా చెపుతామని లోకేశ్ అన్నారు. విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని... భూములు లాక్కున్నారని, కిడ్నాప్ లు చేశారని మండిపడ్డారు. దసపల్లా భూములను లాక్కున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలకు కట్టుబడి ఉన్నామని... అయితే, అన్నింటినీ నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అన్నారు.