గూడ్స్ ట్రైన్ కింద పడ్డా ప్రాణాలతో బయటపడ్డ మహిళ.. వీడియో ఇదిగో!
- తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘటన
- పట్టాలు దాటుతూ పడిపోయిన మహిళ
- ట్రైన్ దగ్గరికి రావడంతో అలాగే పడుకుండిపోవడంతో దక్కిన ప్రాణం
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన. ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళలు నావంద్గి రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటి అవతలివైపు ఉన్న ప్లాట్ ఫాం పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. గూడ్స్ ట్రైన్ నెమ్మదిగా వస్తుండడం చూసి హడావుడిగా దాటుతున్నారు. ఓ మహిళ పట్టాలు దాటగా.. మరో మహిళ మాత్రం పట్టాల మధ్యలో పడిపోయింది. దీంతో కొన్ని సెకండ్ల పాటు అలాగే రాళ్లపైన అతుక్కుపోయినట్లు కదలకుండా ఉండిపోయింది. మధ్యలో ఒకసారి తల ఎత్తి చూసేందుకు ప్రయత్నించగా.. కెమెరాలో అదంతా రికార్డు చేస్తున్న వ్యక్తి హెచ్చరించడం వీడియోలో వినిపించింది.