Janmashtami: శ్రీకృష్ణాష్ట‌మి స్పెష‌ల్‌.. ఆక‌ట్టుకుంటున్న సుదర్శన్ పట్నాయక్ అద్భుత క‌ళాఖండం!

On the occasion of Janmashtami Artist Sudarsan Pattnaik Created Sand Sculpture
ఇసుక‌తో బీచ్‌లో తీర్చిదిద్దే త‌న అద్భుత‌మైన క‌ళాఖండాల‌తో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అంద‌రినీ అబ్బుర‌ప‌‌రుస్తుంటారు. ఇసుకతో ఆయన వేసే అత్యద్భుతమైన చిత్రాలు మనసుల్ని కదిలిస్తాయి. అలాగే సుదర్శన్ తీర్చిదిద్దే ఇసుక కళాఖండాలు మనల్ని ఆలోచింపజేస్తాయి కూడా. 

ఇక నేడు శ్రీకృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఆయ‌న మ‌రో అద్భుత‌మైన క‌ళాఖండానికి ప్రాణం పోశారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 'కిల్ ద ఈవిల్' అనే సందేశంతో ఆయ‌న శ్రీకృష్ణుడి సైక‌త శిల్పాన్ని తీర్చిద్దారు. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ శిల్పం బీచ్‌కు వ‌చ్చేవారిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. దీని తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో ప్రత్య‌క్షం కావ‌డంతో సుదర్శన్ పట్నాయక్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అద్భుత‌మైన క‌ళాఖండం అంటూ ప్రశంసల వ‌ర్షం కురిపిస్తున్నారు.
Janmashtami
Sudarsan Pattnaik
Puri Beach
Odisha

More Telugu News