బాలినేని రీకౌంటింగ్ పిటిషన్ పై ముగిసిన విచారణ .. తీర్పు రిజర్వ్
- సుప్రీం కోర్టు తీర్పును బాలినేని తప్పుగా అర్దం చేసుకున్నారన్న ఈసీ తరపు న్యాయవాది
- మాక్ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిందని వెల్లడి
- ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్ లు సరిపోల్చాలని కోరుతున్న బాలినేని
అయితే పిటిషనర్ల తరపు వాదనను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్ధం చేసుకున్నారని వాదనలు వినిపించారు. వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించి ఈవీఎంలో పోలైన ఓట్లతో సరి పోల్చాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. ఈవీఎంలో సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేస్తారని, అది ఏమైనా ట్యాంపర్ జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రమే అభ్యర్ధుల సమక్షంలో సాంకేతిక నిపుణులు పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.